శ్రీ రామనవమి ప్రత్యేక పూజలో గురజాల జగన్మోహన్

568చూసినవారు
శ్రీ రామనవమి ప్రత్యేక పూజలో గురజాల జగన్మోహన్
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా చిత్తూరు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ జెండామాను వీధిలోని రామాలయంలో బుదవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి,అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రజలు సుఖ సంతోషాలు,ఆయురారోగ్యాలతో జీవించాలని దేవ దేవుడిని మొక్కుకున్నట్లు గురజాల జగన్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ పి వెంకట్, జగదీశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్