చిత్తూరు రూరల్ మండలం పాలూరు గ్రామం వద్ద అక్రమంగా ఉంచిన ఇసుక నిల్వలపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని టిడిపి, జనసేన, బిజెపి కూటమి నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ఇసుక అక్రమ నిల్వలను పరిశీలించారు. టిడిపి ప్రభుత్వంలో ఇసుకను ఉచితంగా ఇస్తే వైసిపి ప్రభుత్వంలో బినామీల పేరుతో ప్రైవేటు సంస్థలకు ఇసుకను ధారాదత్తం చేసిందని కూటమి చిత్తూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఆరోపించారు.