గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

16485చూసినవారు
చిత్తూరు- పుత్తూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆదివారం వేకువ జామున ప్రాంతంలో ఎస్ఆర్ పురం మండలం, ఆర్కెవిబి పేట బస్ స్టాప్ వద్ద గుర్తుతెలియని వాహనం రోడ్డు వైపు వెళ్తున్న రామరాజు అనే వ్యక్తిని ఢీకొనింది. దీంతో రామరాజు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు 108 ద్వారా అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్