దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి 29 వరకు పలు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం మరియు త్రిపురలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ వర్షాలు.. పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.