రూ. 1, 20, 000 పలికిన బాల గణేష్ లడ్డూ

54చూసినవారు
కుప్పం పట్టణలోని ప్యాలెస్ ఎక్స్టెన్షన్ లో ఏర్పాటు చేసిన బాల గణపతికి ప్రసాదంగా పెట్టిన లడ్డూను గురువారం రాత్రి వేలం పాట వేశారు. వేలం పాటలో అత్యధికంగా రూ. 1, 20, 000 వేలకు పాట పాడిన జల్సా పవన్ లడ్డూని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా జల్సా పవన్ను కమిటీ సభ్యులు పూలమాలలు వేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం లడ్డూ అందజేశారు.

సంబంధిత పోస్ట్