ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుడిపై వేడి నీళ్లు పడి తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లె సీఐ శేఖర్ కథనం మేరకు. మదనపల్లె పట్టణం సిటిఎం రోడ్ లోని ఓ పైపుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన అనిల్ కుమార్ పాండే మీద ప్రమాదవశాత్తు వేడి నీళ్లు పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన సహచరులు బాధితుడిని చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.