యాక్సిడెంట్ కేసులో నేరం నిరూపణ కావడంతో ముద్దాయికి జడ్జి విష్ణువర్మ నూతన తీర్పును ఇచ్చారు. వివరాల్లోకి వెళితే 2022వ సంవత్సరం రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు మృతిచెందిన సంఘటనలో వెంకటరమణ అనే వ్యక్తిపై నగరి పోలిస్ స్టేషన్లో యాక్సిడెంట్ కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నగరి జూనియర్ సివిల్ మెజిస్ట్రేట్ కోర్టులో గురువారం ముగింపుకు వచ్చింది. నేరం నిరూపణ కావడంతో ముద్దాయికి శిక్షపడింది. మృతుని కుటుంబానికి రూ. పదివేలు నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఆరు నెలల పాటు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కమ్యూనిటీ సర్వీస్ చేయాలని జడ్జి విష్ణువర్మ శిక్ష విధించారు.