ఆరోగ్య సమస్యలు లేని జీవితానికి ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరమని, అందుకు అవగాహన ప్రధానమని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ శివయ్య అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సం సందర్భంగా ఆదివారం పీలేరులో వైద్యులు, వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఈ కొండయ్య, తలుపుల, రేగళ్ళు పి. హెచ్. సిల క్షేత్ర స్థాయి పర్యవేక్షకులు, ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.