రాజకీయ లబ్ధి కోసం జగన్ చేస్తున్న కుట్రలకు అమాయక వృద్ధులు బలవుతున్నారని తెలుగుదేశం పార్టీ పీలేరు నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ పోలిశెట్టి సురేంద్ర తెలిపారు. పెన్షన్లపై జగన్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వృద్దులు, వికలాంగులు, వితంతువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సామాజిక పెన్షన్ దారులకు టిడిపి ఈ ఏడాది ఏప్రిల్ నుంచే రూ. 4000 పెన్షన్ ప్రకటించిందని, తాము అధికారంలోకి వచ్చాక ఇది అమలు చేస్తామని అన్నారు.