రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

4679చూసినవారు
బంగారుపాలెం మండలంలోని కేజీ సత్రం యూటర్న్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును మామిడికాయల లోడుతో వెళ్తున్న టెంపో వాహనం ఢీకొట్టింది. ఘటనలో కారులో ఉన్న పన్నెండేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లితండ్రుల పరిస్థితి విషమించడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్