అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి

568చూసినవారు
అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు కోరారు‌. ఐరాల మండలం వేదగిరివారిపల్లి పంచాయతీలో పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ తో కలిసి ఆదివారం ప్రచారం చేపట్టారు. ప్రసాద్ రావు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కనీస సౌకర్యాలు కరవయ్యాయని విమర్శించారు.

సంబంధిత పోస్ట్