రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి

84చూసినవారు
రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి
రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతిచెందిన ఘటన పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు ఘాట్ రోడ్డులో మంగళవారం సాయంత్ర జరిగింది. స్థానికుల వివరాలు మేరకు కలకడ మండలం పాపిగారిపల్లికి చెందిన గొర్రెల కాపరులు తమ గొర్రెలతో మేతకు వెళ్లి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా కల్లూరు ఘాట్ రోడ్డులో ఎదురుగా వచ్చిన లారీ గొర్రెలను ఢీకొనడంతో 25 గొర్రెలు మృతిచెందాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్