పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని ఆరు గ్రామ సచివాలయం నందు పనిచేస్తున్న 43 మంది గ్రామ వాలంటీర్లు మూకుమ్మడిగా బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు తమ రాజీనామా పత్రాలను సచివాలయ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులకు అందజేశారు. రాజీనామా చేసిన వారు మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల దృష్ట్యా తాము రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.