హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

82చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణంలో హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో పలువురు హిందువులు మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు. లడ్డూలో కల్తీ నెయ్యి వివాదాల నేపథ్యంలో భక్తులు కోనేటి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి గోవిందా గోవిందా అంటూ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేత పట్టుకుని నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ చేశారు. ఇలాంటి కల్తీలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని హిందూ జాగరణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్