శాకాంబరీ అలంకారంలో దర్శనమిచ్చిన బోయకొండ గంగమ్మ

53చూసినవారు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువ పల్లి గ్రామంలో వెలిసిన బోయకొండ గంగమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం శాకాంబరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి పలు రకాల ఆభరణాలు, కూరగాయలతో ప్రత్యేక అలంకరణ చేశారు. కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్