పీహెచ్ సీ ఆకస్మిక తనిఖీ చేసిన డిపిఎంవో

70చూసినవారు
పీహెచ్ సీ ఆకస్మిక తనిఖీ చేసిన డిపిఎంవో
పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలోని పిహెచ్ సీ ని బుధవారం డిపిఎమ్ఓ రామ్మోహన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించి సుముకత వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన వ్యాక్సిన్ ను నిర్ణీత సమయంలో వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ఇరికిపెంట విలేజ్ హెల్త్ క్లినిక్ ను సందర్శించి వైద్య సిబ్బందికి సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్