సదుం మండలంలో ఏనుగుల హల్చల్

62చూసినవారు
సదుం మండలంలో ఏనుగుల హల్చల్
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో శనివారం తెల్లవారుజామున ఏనుగులు హల్చల్ చేశాయి. మండలంలోని మార్తు వారి పల్లెలో రైతులు జనార్దన్ రెడ్డి, చంద్రమ్మ, కృష్ణమ్మ, రెడ్డెప్ప , రెడ్డిలకు చెందిన వరి, చెరుకు పంటలను ధ్వంసం చేసాయి. మండలంలో ఎప్పుడు ఏనుగుల బెడద తమకు తప్పడం లేదని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు తమను ఆదుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్