ఎన్నికలలో గద్దెనెక్కడానికి చంద్రబాబు నాయుడు చేసే తప్పుడు వాగ్దానాలను ప్రజలు నమ్మకండి అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి పుంగనూరు పట్టణంలో ఆయన మాట్లాడుతూ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ఏది కూడా అమలు చేయకుండా తన పబ్బం గడుపుకున్నారన్నారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి గొంతెమ్మ కోరికలు ప్రజలకు చెబుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.