చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక తరగతులు

72చూసినవారు
చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక తరగతులు
పుంగనూరు నియోజకవర్గం స్థానిక చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం నుండి ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ జయప్రకాష్ బుధవారం తెలియజేశారు.కావున ఫెయిల్ అయిన విద్యార్థులందరూ నిరుత్సాహపడకుండా ప్రత్యేక తరగతులకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులందరికీ అన్ని సబ్జెక్టుల లెక్చరర్లు శిక్షణ ఇవ్వడానికిఅందుబాటులో ఉంటారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్