నాగలాపురం మండల కేంద్రంలో మండల తహశీల్దార్ నరసింహులు ఆధ్వర్యంలో శనివారం ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ జరిగింది. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ నిర్భయంగా, స్వేచ్ఛగా వేసుకోవాలని నినాదాలు చేశారు. 18 ఏళ్లు వయసు నిండిన వారు తమ ఓటు హక్కు కోసం ఈనెల 17వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరత్న, వీఆర్వో నాగభూషణం, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.