కొనసాగుతున్న పోలీసు పికెటింగ్

73చూసినవారు
కొనసాగుతున్న పోలీసు పికెటింగ్
కేవీబీపురం మండలం రాగిగుంట, పెరిందేశం గ్రామాల్లో పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది. వినాయక చవితి రోజున తలెత్తిన చిన్న వివాదంతో రెండు గ్రామాల మధ్య పరస్పర దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు ఏఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. నారాయణవనం రూరల్ సీఐ భాస్కర్ నాయక్, కేవీబీ పురం ఎస్ఐ వీరాంజనేయులు, పిచ్చాటూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు పికెటింగ్ ను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్