కీలపూడిలో వైసీపీ అభ్యర్థి ప్రచారం

73చూసినవారు
పిచ్చాటూరు మండలం కీలపూడిలో వైసీపీ సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేశ్ సోమవారం ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామంలోని శ్రీఅభయాజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి ఇంటింటా కరపత్రాలు పంచారు. ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్