శ్రీకాళహస్తిలో సీపీఎం నాయకుల ధర్నా

66చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. డీటీ శాంతికి వినతిపత్రం సమర్పించారు. ఉచిత ఇసుక హామీ ఎక్కడ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీపీఎం నాయకుడు నాగరాజు మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ అంటూ ప్రజల్ని మోసం చేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం తరహాలోనే అధిక ధరలకు ప్రజలు ఇసుక కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు.

సంబంధిత పోస్ట్