కాణిపాక సిద్ధి వినాయకుడికి దుర్గగుడి నుంచి పట్టువస్త్రాలు

82చూసినవారు
చిత్తూరు జిల్లాలోని శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి దేవస్థానంలో కొలువైన గణపతికి దుర్గగుడి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్, ఏఈఓ వెంకట్ రెడ్డి పట్టు వస్త్రాలను శుక్రవారం సమర్పించారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు ఎస్వీ కృష్ణారెడ్డి, హరి, మాధవరెడ్డి, సూపరింటెండెంట్లు వాసు, కోదండ పాణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్