పొంచి ఉన్న ప్రమాదం

57చూసినవారు
తంబళ్లపల్లె పట్టణంలోని దేవలం వీధిలోని శ్రీ కోదండ రామాలయం పక్కనే గల విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్కు ఏర్పాటు చేసిన ఫీజుల వద్ద వైరు మండుతూ ప్రమాదకరంగా ఉందని స్థానికులు తెలిపారు. లైన్లలో సమస్య వల్లనో, ట్రాన్స్ ఫార్మర్ లోడ్ ఎక్కువయో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఫీజుల వద్ద వైరు కాలుతోంది. రాత్రి వేళల్లో వైరు కాలి కింద పడితే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అధికారులు స్పందించి సమస్య ను పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్