రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

3287చూసినవారు
రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
రైలు నుంచి కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం ములకల చెరువు మండలంలో వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు. మండలంలోని బురకాయల కోట సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కలో ఒ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కుళ్ళి ఉండటాన్ని పశువుల కాపరులు గుర్తించారు. ఎస్సై తిప్పేస్వామి, ఏఎస్ఐ నజీర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్