మల్లన్నకు ప్రత్యేక పూజలు

58చూసినవారు
తంబళ్లపల్లె మల్లయ్య కొండ శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున ఉదయాన్నే స్వామివారు, భ్రమరాంబ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకాలు చేశారు. భక్తుల పేరిట పూజలు, అభిషేకాలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. కొండపై భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ ఛైర్మన్ KRమల్ రెడ్డి, ఈఓ రమణ, పాలకమండలి సభ్యులు ప్రభాకర్ రెడ్డి ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్