తంబళ్లపల్లె నియోజకవర్గానికి త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జై భారత్ పార్టీ అభ్యర్థిగా తంబళ్లపల్లి కి చెందిన పీట్ల అంజలి (రాజనాలన) ఎంపిక చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రకటనలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె గురువారం మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న లక్ష్మీనారాయణ తనకు తంబళ్లపల్లికి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.