అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

68చూసినవారు
అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో సోమవారం రాత్రి క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది.

సంబంధిత పోస్ట్