గంగవరం మండలంలోని గండ్రాజుపల్లి పంచాయతీలోని మార్లపల్లె, గుండుగల్లు పంచాయతీ కేంద్రం, పసుపత్తూరు పంచాయతీల పరిధిలో సోమవారం జరిగిన ప్రచార కార్యక్రమాలలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ఆయన ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో గంగవరం మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.