దుర్గ గుడిలో భక్తులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం

72చూసినవారు
విజయవాడ కనక దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరోవైపు భవానీలు తరలి రావడంతో క్యూలైన్ల కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో పోలీసులకు భక్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భారీగా భక్తులు తరలిరావడంతో పోలీసులకు కూడా కష్టతరంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్