అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతిచెందారు. ఆమె మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. రమాదేవి మృతిచెందడం దురదృష్టకరమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురికి అత్యవసర వైద్యసేవలు అందించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.