'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎర్రగుంట్లలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను వయసులో చిన్నవాడినైనా రాష్ట్రం కోసం పని చేశానని అన్నారు. తన కంటే ముందు 75 ఏళ్లు ముసలాయన సీఎంగా చేశారని.. ఇంత చిన్నోడు చేసిన పనులను 14 ఏళ్ల అనుభవం చేయగలిగిందా? అని జగన్ ప్రశ్నించారు. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదని జగన్ అన్నారు.