స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ఊరట లభించింది. అచ్చెన్న దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. అచ్చెన్నపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఈ సందర్భంగా సీఐడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.