మాజీ మంత్రి విడదల రజిని పీఏపై ఫిర్యాదు

55చూసినవారు
మాజీ మంత్రి విడదల రజిని పీఏపై ఫిర్యాదు
పల్నాడు జిల్లాలో వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని పీఏపై యడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2020లో రజిని పీఏ రామకృష్ణ రూ.5 కోట్ల లంచం కోసం తమను బెదిరించాడని, రూ.2.20 కోట్లకు రజిని మరిది గోపీ డీల్ సెట్ చేశారన్నారు. పీఏ రామకృష్ణ దందాకు అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా సహకరించాలని బాధితులు ఆరోపించారు. తమను బెదిరించి రూ.2.20 కోట్లు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు పల్నాడు అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతికి ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్