రాష్ట్రంలోనే తొలిసారి బ్రెయిలీ లిపిలో ఫిర్యాదు

63చూసినవారు
రాష్ట్రంలోనే తొలిసారి బ్రెయిలీ లిపిలో ఫిర్యాదు
ఏపీలోనే తొలిసారిగా బ్రెయిలీ లిపిలో ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖపట్నంలోని క్రేసుల్లా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ వారు అధిక లాభాలు ఇస్తామని చెప్పి తన వద్ద రూ.2.9 లక్షలు తీసుకుని మోసం చేసిందని అనకాపల్లి జిల్లా జల్లూరుకు చెందిన దివ్యాంగుడు ఫిర్యాదు చేశారు. అలాగే తన స్నేహితుడి వద్ద రూ.11 లక్షలు తీసుకుని దగా చేసిందని పేర్కొన్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్