వైసీపీ పాలనలో గత నాలుగేళ్ల కాలంలో అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వచ్చాయని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై 4,39,679 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. కానీ తమ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదని, అద్భుతమైన పాలన అందించామని సీఎం జగన్ తనకు తాను సర్టిఫై చేసుకుంటున్నారని ఆయన అన్నారు.