మంగళగిరి నియోజకవర్గంలోని బైక్ మెకానిక్లు, ఇసుక ముఠా కార్మికులతో నారా లోకేశ్ భేటీ అయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలనలో మొదటి బాధితులు భవన నిర్మాణ కార్మికులేనన్నారు. పనుల్లేక వందలాది మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక నిర్మాణ కార్మికులకు మెరుగైన శిక్షణ కోసం మంగళగిరిలో కన్స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.