AP: విశాఖలో అనుమతులు లేకుండా వైసీపీ చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని జనసేన నేత మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై జీవీఎంసీ కమిషనర్కు ఆయన ఫిర్యాదు చేశారు. విశాఖ, అనకాపల్లిలో వైసీపీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములు తీసుకున్నారని మూర్తి ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలకు అనుమతులు తీసుకోలేదన్నారు.