ఢిల్లీ మెట్రో రైలులోని మహిళా కోచ్లోకి పురుషులు ఎక్కువ మంది ఎక్కారు. దీంతో ఇబ్బంది పడిన మహిళలు ఫిర్యాదు చేశారు. మెట్రో రైలు ఒక స్టేషన్కు చేరుకోగానే పోలీసులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. లేడీస్ కోచ్లో ప్రయాణించిన మగవారిని చెంపదెబ్బలతో మహిళా పోలీసులు స్వాగతించారు. లోపల ఉన్న వారిని కూడా దించివేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పోలీసుల చర్యను కొందరు సమర్థించగా మరికొందరు తప్పుపట్టారు.