చదివించే స్థోమత లేక.. కుమార్తెతో కలిసి బావిలోకి దూకిన మహిళ

64చూసినవారు
చదివించే స్థోమత లేక.. కుమార్తెతో కలిసి బావిలోకి దూకిన మహిళ
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. పిల్లలను చదివించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఐదేళ్ల కుమార్తెతో కలిసి మహిళ బావిలోకి దూకింది. మరో కుమారుడ్ని కూడా వెంట తీసుకెళ్లేందుకు ఆమె ప్రయత్నించింది. అయితే ఆమెతో వెళ్లేందుకు నిరాకరించిన ఆ బాలుడు బతికిపోయాడు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తుల సహాయంతో భాగ్యశ్రీ, ఐదేళ్ల కూతురు సమీక్ష మృతదేహాలను బావి నుంచి బయటకు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్