ఏపీలో మరో రెండు పథకాల పేర్లను టీడీపీ ప్రభుత్వం మార్చివేసింది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల పేర్లను మార్చింది. ఈ పథకాలకు బాలసంజీవనిగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, జగన్ హయాంలో అమలైన పలు పథకాలకు ఇప్పటికే పేర్లు మార్చింది. వైఎస్సార్ పింఛన్ కానుకను ఎన్టీఆర్ భరోసాగా, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెనను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా, వైఎస్సార్ కల్యాణ మస్తును చంద్రన్న పెళ్లి కానుకగా మార్పు చేశారు.