ఏలూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఏలూరు నగరంలోని వెన్నవల్లివారిపేటలో రమణమ్మ (60) అనే వృద్ధురాలు నివశిస్తుంది. ఈ క్రమంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు నగలు దోచుకొని ఆపై ఆమెను గొంతకోసి హత్య చేశారు. ఆపై మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.