ఏటీఎంలలో నగదు డ్రా చేసే వారికి ఆర్బీఐ షాక్ ఇచ్చింది. ఒక నెలలో ఐదు సార్లు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఏటీఎంల నుంచి నగదును తీసుకోవచ్చు. అయితే ఆ పరిమితి దాటిన తర్వాత ఇకపై ఒక్కో లావాదేవీపై ఛార్జీ పడనుంది. ఒక్కో ట్రాన్స్క్షన్పై దాదాపు రూ.23 చొప్పున ఛార్జీ వసూలు చేసుకునేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో అందరూ ఆన్లైన్ లావాదేవీలకే మొగ్గు చూపే అవకాశం ఉంది.