అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని గుండాలకోన ఆలయం వద్ద భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ క్రమంలో మృతుల కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు.