AP: టీడీపీ కార్యకర్తలు, నేతలతో టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. "అధికారం ఉందని కక్ష సాధింపులు, ప్రజావ్యతిరేక పనులు చేయవద్దు. బాధ్యతగా, చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు మళ్లీ ఆదరిస్తారు. కూటమి విజయం కోసం కష్టపడిన వారికి త్వరలోనే నామినేటెడ్ పదవులు ఇస్తాం. ఎవరు, ఎక్కడ ఏం చేశారో చూసి పదవులు ఇస్తాం." అని ఆయన పేర్కొన్నారు.