నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: ఎంపీ పురందేశ్వరి

57చూసినవారు
తూ. గో జిల్లాలో శనివారం రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో వరద ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వరద నష్ట వివరాలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్