కాకినాడ: 9న ఆలయంలో సామూహిక సరస్వతి పూజలు
శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం దసరా నవరాత్రుల్లో భాగంగా మూలా నక్షత్రం పురస్కరించుకుని సామూహిక సరస్వతి పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంధి బాబ్జి, ఆలయ ఈవో వీర్రాజు చౌదరి పేర్కొన్నారు. మంగళవారం ఆలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. సామూహిక సరస్వతిపూజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.