ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి

55చూసినవారు
ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి
వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం మంత్రి దుర్గేష్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ముంపు ప్రాంతంలో పర్యటించారు. ప్రజలకు ధైర్యం చెప్పారు. సింగ్‌నగర్‌లో పర్యటించి వరద బాధితులకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్