10 నుంచి నీటి సరఫరా నిలుపుదల: ఎస్ఈ

61చూసినవారు
10 నుంచి నీటి సరఫరా నిలుపుదల: ఎస్ఈ
ర్గోదావరి డెల్టా సిస్టం పరిధిలో గల పంట కాలువలకు రబీ సీజన్‌లో సాగునీటి సరఫరా నిరంతరాయంగా జరుగుతుందని ధవళేశ్వరం చీఫ్ ఇంజినీర్ సతీష్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా ప్రధాన కాలువల పరిధిలో గల వరి పంట, తాగునీటి అవసరాలు చివరి స్థాయికి చేరుకున్నాయన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి పంట కాలువలకు సాగు నీటి విడుదల నిలుపుదల చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్